PLD: ప్రజా సమస్యలను వేగంగా, చట్టబద్ధంగా పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ జే.వీ. సంతోష్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 66 ఫిర్యాదులు వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు.