KRNL: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఉరుకుంద ఈరన్నస్వామి సన్నిధిలో నేడు రుద్ర హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో విజయరాజు తెలిపారు. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతినెలా రుద్ర హోమం చేపడుతున్నట్లు వెల్లడించారు. భక్తులు సేవ రుసుం రూ. 1500 చెల్లించి హోమంలో పాల్గొన్న సేవా భక్తులకు ఆలయ తరపున శేషవస్త్రం, రెండు లడ్డూ ప్రసాదాలు అందిస్తామన్నారు.