BPT: ‘మొంథా’ తుపానును ఎదుర్కొనేందుకు రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన దళం రంగంలోకి దిగింది. సోమవారం 35 మంది సభ్యులతో కూడిన SDRF బృందం బాపట్ల సూర్యలంక సముద్ర తీరానికి చేరుకుంది. తుఫాను పరిస్థితిని ఈ బృందం పరిశీలించింది. జిల్లాలో పరిస్థితులను బట్టి సేవలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొంటామని అన్నారు.