KDP: మైదుకూరు ప్రాంతంలో రైతులు పసుపు సాగులో కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. పసుపుతో పాటు అంతర పంటగా బొప్పాయిని సాగు చేస్తున్నారు. డ్రిప్ ద్వారా నీటి తడులు అందించడంతో తోటలు ఏపుగా పెరుగుతున్నాయి. మైదుకూరు, దువ్వూరు, ఖాజీపేట, చాపాడు మండలాల్లో ఈ సాగు విస్తృతంగా చేపట్టారు. ఇక్కడ పండిన పసుపు నాణ్యత వ్యాపారులను ఆకర్షిస్తోంది