NLR: మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన బస్సుప్రమాదంలో కొండాపురం మండలం తూర్పు యర్రబల్లికి చెందిన తల్లీ, కుమార్తె గురువారం మృతి చెందారు. తూర్పు యర్రబల్లికి చెందిన నర్సింగు శ్రీను, అతని భార్య ప్రభావతి, కుమార్తె చైత్ర పనులు చేసుకుంటూ జగిత్యాలలో నివాసం ఉంటున్నారు. ఆమె తన పుట్టింటికి తిరిగి వస్తుండగా బస్సు ప్రమాదంలో చిక్కుకొని ఇద్దరు మృతి చెందారు.