KRNL: ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామంలో మే 1న తేదీన వర్చువల్ విధానంలో టెక్స్ టైల్ పార్క్ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ మేరకు మంగళవారం సంబంధిత అధికారులతో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, MLA జయ నాగేశ్వర రెడ్డి కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం బనవాసిలో టెక్స్ టైల్స్ పార్క్ స్థల ప్రాంతాన్ని తనిఖీ చేసి, ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.