కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో మంగళవారం స్వామి వారికి భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.1 లక్ష 34 వేల ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 134 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 26 ద్విచక్ర వాహన పూజలు నిర్వహించారని, 12 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు అని ఆయన తెలిపారు.