NLR: వెంకటాచలం మండలం పూడిపర్తిలో బీడుగా ఉన్న భూములను సాగులోకి తేవడమే లక్ష్యమని సర్వేపల్లి MLA సోమిరెడ్డి తెలిపారు. జంగిల్ క్లియరెన్స్ పనులు పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 230 ఎకరాలు శుభ్రం చేయగా, మరో నెలలో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. చెక్ డ్యాం,లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దళిత, గిరిజన భూములకు సాగునీరు అందించనున్నట్లు పేర్కొన్నారు.