ASR: పెదబయలు మండలం జామిగూడ పంచాయతీ దుర్గం గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. సదుపాయాలు లేక ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి కాలువల్లోని కలుషిత నీటినే వాడుతున్నట్లు స్థానికులు తెలిపారు. దీనివల్ల మహిళలు, వృద్ధులు, పిల్లలు నానా అవస్థలు పడుతున్నారన్నారు. వేసవిలో ఈ కష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని, అధికారులు స్పందించి సురక్షిత త్రాగునీరు అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.