NLR: సంగం మండలంలోని వెంగారెడ్డి పాలెం శ్రీ సాయిబాబా మందిరంలో శుక్రవారం ఆరవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక పుష్పాలంకరణలో స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. పవిత్రమైన ప్రసాదాలను భక్తులు స్వీకరించారు.