కోనసీమ: బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొత్తపేట పోలీస్ డివిజన్ అధికారి సుంకర మురళీ మోహన్ సూచించారు. వచ్చే మూడు రోజులు చాలా కీలకమైనవని అన్నారు. తప్పనిసరి పనులు ఉంటేనే గానీ ప్రయాణాలు పెట్టుకోవద్దని తెలిపారు. సముద్రం వద్దకు, గోదావరి వద్దకు వెళ్లకుండా ప్రజలు తగు జాగ్రత్తలు వహించాలని ఆయన కోరారు.