సత్యసాయి: తలుపుల మండలం గరికపల్లికి చెందిన నాలుగేళ్ల కొమ్మెర హర్షవర్ధన్ అదృశ్యంపై ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు గాలింపు ప్రారంభించారు. నంబులపూలకుంట మండలంలోని గౌకనపేట అడవీ ప్రాంతంలో బాలుడి మృతదేహం గుర్తించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. హత్యపై పోలీసులు వేగంగా విచారణ చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.