E.G: రాజనగరం మండలం శ్రీకృష్ణపట్నం, గోపాలపట్నం గ్రామాలకు చెందిన ఎంపీటీసీ బత్తుల కరుణాకర్ రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. కరుణాకర్కు జనసేన పార్టీ కండువా వేసి ఆదివారం సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రామకృష్ణ చేసే అభివృద్ధికి ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు.