CTR: కార్వేటినగరం మండలం టీకేఎంపేట గ్రామంలో సచివాలయంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్, జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ హాజరయ్యారు. రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకొని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.