PPM: వీరఘట్టం నుంచి పాలకొండ మీదుగా ఒడిశాకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పాలకొండ వద్ద శనివారం పట్టుకున్నారు. అజ్ఞాత వ్యక్తి సమాచారం మేరకు పాలకొండ చెక్ పోస్ట్ దగ్గర విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టారు. రేషన్ తరలిస్తున్న వ్యాన్ను గమనించి ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. పట్టుకున్న బియ్యం సుమారు 2,000 కేజీలు ఉంటుందని వెల్లడించారు.