PPM: ఇంధన పొదుపు అలవాటుగా మార్చుకోవాలని పార్వతీపురం జేసీ ఎస్ఎస్. శోభిక అన్నారు. శనివారం ఏపి తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 20 వరకు జరగనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆమె జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపు అలవాటుగా మార్చుకోవాలన్నారు.