కృష్ణా: నూజివీడు ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న కార్గో పాయింటును మంగళవారం కార్గో మేనేజర్ జి లక్ష్మీప్రసన్న వెంకట సుబ్బారావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీకి కార్గో ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈనెల 20 నుంచి వచ్చే నెల 19 వరకు డోర్ డెలివరీపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.