ELR: జిల్లాలో బడి ఈడు పిల్లలందరిని బడిలో చేర్చి డ్రాప్ ఔట్లు లేరని పాఠశాల, గ్రామ, మండల స్థాయిలో నిర్ధారించి ఈనెల 25వ తేదీలోపు సమర్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఇంకా 3,590 మంది విద్యార్థులు బడి బయట ఉన్నట్లు తెలిపారు.