కృష్ణా: కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమపై దోపిడీ ఆరోపణలు చేయడం అనవసరమన్నారు. ఆరోపణలను నిరూపించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.