ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సాగునీటి సంఘం DC అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు మంగళవారం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో సంతమాగులూరు మండల డీసీ అధ్యక్షుడిగా అడవిపాలెంకు చెందిన శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడిగా ఏల్చూరు గ్రామానికి చెందిన నాసరయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. నీటి సంఘాల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.