KRNL: ఆలూరు మండలం హత్తిబెలగల్ గ్రామంలో మైనారిటీ వింగ్ అధ్యక్షుడు శర్మష్ ఖాన్ తల్లి మంగళవారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి భౌతిక కాయానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎమ్మెల్యే వెంట పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.