సత్యసాయి: కదిరి పట్టణంలోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ‘తల్లికి వందనం’ పథకం కింద ఖాతాల్లో జమైన రూ. 13,000 నగదు తీసుకోవడానికి మహిళలు ఉదయం నుంచే క్యూ లైన్లలో నిలిచారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకంతో తపాలా కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచే భారీ రద్దీ నెలకొంది. బ్యాంకుల వద్ద కూడా ఇదే తరహా గుమిగూడిన ప్రజలతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.