నెల్లూరు: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సోమవారం కావలి పట్టణంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కావలి పట్టణం బాపూజీ నగర్ మున్సిపల్ ప్లాట్స్ నందు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాచే సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబడుతుందని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని కార్యకర్తలు గమనించాలన్నారు.