KDP: పెండ్లిమర్రి మండలం పాత సంగటిపల్లిలో శుక్రవారం రాత్రి పోలీసు కళా-జాగృతి బృందం ‘మేలుకొలుపు’ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా సి.ఐ చల్లని దొర మాట్లాడుతూ.. కక్షలకు దూరంగా ఉంటూ, పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. సైబర్ నేరాలు, పోక్సో, బాల్య వివాహాలు, రహదారి భద్రత వంటి అంశాలపై నాటకాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.