CTR: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దని జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో సోమవారం ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలతో అధికారులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రతి అర్జీని తప్పక పరిష్కరించాలని చెప్పారు.