ATP: సింగనమల మండలం కల్లుమడి గ్రామంలో రెవెన్యూ సదస్సులపై మంగళవారం తహశీల్దార్ బ్రహ్మయ్య గ్రామ ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తహశీల్దార్.. గ్రామంలోని భూ సమస్యలపై రైతులు నుంచి అర్జీలను స్వీకరించారు. త్వరలోనే ఇచ్చిన అర్జీలను విచారణ జరిపి సమస్యలను పరిష్కరిస్తామని గ్రామ ప్రజలకు తెలిపారు.