అన్నమయ్య: జిల్లాలోని రాయచోటి, మదనపల్లి, రాజంపేట సబ్ డివిజన్ల పరిధిలో జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయనీ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎక్కడా ఎలాంటి గొడవలు ఘర్షణలు తలెత్తకుండా పటిష్టమైన పోలీసు భద్రత ఏర్పాట్లతో పాటు, ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.