కృష్ణా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన ఆయనకు స్వాగతం పలికారు. డీజీపీతో కలిసి ఎస్పీ గంగాధరరావు, డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీ పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నారు.