ASR: అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మంగళవారం హుకుంపేట మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా ఆయన జీ.బొడ్డపుట్టు జీటీడబ్ల్యూ బాలికల ఆశ్రమ పాఠశాల తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. విద్యార్థినులకు మెరుగైన విద్యను అందించాలన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీచేసి పలు సూచనలు చేశారు. అనంతరం డాబావలస మెయిన్ రోడ్డు పరిశీలించారు.