కృష్ణా: గుడివాడ సీసీఎస్ సీఐ ఇంజరపు రమణమ్మను అమెరికాకు చెందిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ పట్టాతో సత్కరించారు. చెన్నై మైలాపూర్లోని భారతి విద్యా భవన్ ప్రాంగణంలో జరిగిన ఘన వేడుకలో ఈ పురస్కారాన్ని ఆదివారం అందించారు. పలువురు ప్రముఖులు, పోలీస్ శాఖ అధికారులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆమెకు అభినందనలు తెలిపారు.