ప్రకాశం: సంతమాగులూరు గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ రవిబాబు సోమవారం తెలిపారు. గ్రామంలోని సచివాలయం – 2 వద్ద ఉదయం 9 గంటలకు సదస్సు మొదలవుతుంది. గ్రామంలో ఎవరికైనా అడంగల్, 1బి, మ్యుటేషన్ సేవల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి నగదు చెల్లించకుండానే అందిస్తామని పేర్కొన్నారు.