ప్రకాశం: గిద్దలూరు (మం) అంబవరం స్వర్ణ గ్రామ సచివాలయాన్ని ఎంపీడీవో శ్రీ కే. సీతారామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది పనితీరును పరిశీలించిన ఆయన, పింఛన్ల పంపిణీ సమయంలో లబ్ధిదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.