SKLM: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న ప్రచారం అసత్యమని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి తెలిపారు. అన్ని బంకుల్లో ఇంధనం సమృద్ధిగా ఉందని స్పష్టం చేశారు. వదంతులను నమ్మి అధికంగా నిల్వ చేయొద్దని హెచ్చరించారు. అక్రమ నిల్వలు, నల్లబజారు, తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనుమానాస్పద విషయాలు గమనిస్తే 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.