PPM: పట్టణంలోని గోప సాగరం కబ్జాకు గురవుతోందని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పార్వతీపురం రాయగడ రోడ్డులోని గోప సాగరాన్ని ఆ సమితి జిల్లా కార్యదర్శి చుక్క చంద్రరావుతో కలిసి పరిశీలించారు. సర్వే నెంబర్ 102లో గల సుమారు 32 ఎకరాల విస్తీర్ణం కలిగిన గోపసాగరం దాదాపు కబ్జాకు గురవుతోందన్నారు.