CTR: ఏస్ఆర్ పురం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రత్యేక ప్రతిభావంతులకు పరికరాల పంపిణీలో అర్హులైన వారిని గుర్తించేందుకు ఏర్పాటు చేస్తున్న ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మంగళవారం తెలిపారు. అధికారులు ప్రజలకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే కోరారు.