VSP: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు అని జిల్లా రెవెన్యూ అధికారి భవాని శంకర్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగఫలం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు.