ATP: గుంతకల్లు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సోమవారం నుంచి ధనుర్మాస పూజలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఆలయంలో అమ్మవారి మూలమూర్తికి వేకువజామున సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ అష్టోత్తర శతనామ పారాయణం, నారాయణ సోత్రం పారాయణం గావించారు.