కృష్ణా: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 30న గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఎష్ట్రానిక్స్ సిస్టమ్స్,హెటిరో ల్యాబ్స్, జోయాలుక్కాస్ జ్యువెలరీ, మెకనార్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు.