NLR: వింజమూరు మండలంలోని నల్లగొండ్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు సంబంధించి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్ లెక్కల కాంతారెడ్డి, కార్యనిర్వహణాధికారి బి.శాంతయ్య తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.