KDP: వల్లూరు మండలం పుష్పగిరి పుణ్యక్షేత్ర సమీపంలో కామాక్షి అమ్మవారికి శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన తదితర పూజలు చేశారు. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు, పంచామృతాన్ని అందజేశారు.