KDP: పదో తరగతి ఇంగ్లిష్ (థర్డ్ లాంగ్వేజ్) పరీక్షను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. రంజాన్ పండుగ నేపథ్యంలో ఈ నెల 21న పబ్లిక్ హాలిడే వచ్చింది. దీంతో ఆ రోజు జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 9.30 నుంచి 12.45 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని డీఈవోలకు ఆదేశాలిచ్చింది.