ASR: బీమా ద్వారా కుటుంబానికి ధీమా లభిస్తుందని కొయ్యూరు గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ గణేష్ తెలిపారు. ఇటీవల సహజ మరణం పొందిన ఎం.శ్రీనివాసరావు, చెదల బంగారమ్మ కుటుంబ సభ్యులకు గురువారం రూ. 2లక్షల చొప్పున బీమా సొమ్ము అందజేశారు. ప్రధానమంత్రి జీవన జ్యోతి పధకంలో ఏడాదికి రూ. 436 చెల్లిస్తే, సహజ మరణానికి రూ. 2లక్షలు కుటుంబానికి అందుతుందన్నారు.