NLR: రాపూరు మండలంలోని తెగచెర్ల గ్రామపంచాయతీలో సోమవారం ఉప సర్పంచ్ ఉన్నం అక్కిరెడ్డి అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు. ఈ సమావేశంలో తెగచెర్ల గ్రామపంచాయతీ నుంచి గరిమెన పెంట గ్రామాన్ని విడదీసి ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో 132 మంది గ్రామస్తులు, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.