VSP: వాల్తేరు రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో భాగంగా రైల్వే స్క్రాప్తో అద్భుతమైన కళాఖండాలు రూపొందించారు. విశాఖ ఎలక్ట్రిక్ లోకో షెడ్ సిబ్బంది నెమలి జంట, ‘మేక్ ఇన్ ఇండియా’ సింహం నమూనాలను సృష్టించారు. సోమవారం డీఆర్ఎం లలిత్ బోరా మాట్లాడుతూ.. సిబ్బంది కృషి సృజనాత్మకత, సుస్థిరత కలయికను హైలైట్ చేస్తుందని పేర్కొన్నారు.