ప్రకాశం: దర్శి పట్టణ శివాజీ నగర్లోని క్రీస్తు మార్గం మినిస్ట్రీస్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలను దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కైపు వెంకట కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ పౌల్ వెంకటేశ్వర్లు, బ్రదర్ నరేంద్ర, పాస్టర్ రాజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.