VZM: ఈ నెల 29 న జామి MRO కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి బుధవారం తెలిపారు. ఈ మేరకు ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం మొదలవుతుందని మండలంలో ఉన్న ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదుల రూపంలో అందించాలని, పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.