KDP: సిద్ధవటం మండలం మాధవరం-1పరిధి బంగారుపేట గ్రామ శివారులో వెలసిన శ్రీ గంగాభవాని అమ్మవారి 34వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం గంగాభవాని ఆలయ ప్రతినిధుల ఆధ్వర్యంలో అమ్మవారికి పలు విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు.