ASR: డుంబ్రిగూడ మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతం వద్ద శని, ఆదివారాలు రెండు రోజులు సెలవు రోజులు కావడంతో పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. శనివారం 3,045 మంది సందర్శించారని ప్రవేశ రుసుము ద్వారా రూ.1,46,230 ఆదాయం వచ్చిందని, ఆదివారం 4,580 మంది పర్యాటకులు సందర్శించుకోగా రూ.2,25,510 ఆదాయం వచ్చినట్లు సిబ్బంది తెలిపారు.