NLR: నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలం, సోమశిల జలాశయానికి మంగళవారం ఎగువ ప్రాంతాల నుంచి 3,004 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం 72.787 టీఎంసీల నీటిమట్టం నమోదయింది. పెన్నా డెల్టాకు 1500 క్యూసెక్కులు, కండలేరుకు 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.