సత్యసాయి: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ధర్మవరం రూరల్ మండలంలోని గరుడంపల్లి గ్రామ సమీపంలో ఎస్సై శ్రీనివాసులు గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.14,350 నగదు స్వాధీనం చేసుకున్నారు. మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.